Header Banner

ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

  Fri May 23, 2025 18:04        Politics

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్తగా మెగా డీఎస్సీ నిర్వహించేందుకు వీలుగా కూటమి సర్కార్ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మేరకు టెట్ పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. అయితే షెడ్యూల్ ప్రకారం త్వరలో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

 

రాష్ట్రంలో డీఎస్సీతో పాటు టెట్ పరీక్షలు కూడా వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులోని జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు ఆరుగురు అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. వీరు లేవనెత్తిన కారణాలు సమంజసంగా లేవని అభిప్రాయపడింది. దీంతో వీరి పిటిషన్లను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది.

 

ఇది కూడా చదవండి: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?

 

అయితే ఇతరత్రా సమస్యలు ఏవైనా ఉంటే మాత్రం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా పిటిషన్లు దాఖలు చేసిన అభ్యర్ధులకు సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతానికి వీరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ రాష్ట్రంలో డీఎస్సీ, టెట్ పరీక్షలు యథావిధిగా నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రభుత్వం వచ్చే నెల 6 నుంచి జూలై 6 వరకూ ఈ పరీక్షలు నిర్వహించి టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్దమవుతోంది. మొత్తం 16347 పోస్టులకు ఈసారి డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!

 

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!

 

దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!

 

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!



ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #APDSC #MegaDSC2025 #DSCPostponement #APTeachersRecruitment #SupremeCourtDecision #AndhraPradeshNews